Ram Charan: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం `ఆచార్య`. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. సోనూసూద్, జుష్ణు సేన్ గుప్తా విలన్లుగా చేశారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిన్న గ్రాండ్గా విడుదలైంది.
కానీ, ఊహించని విధంగా మార్నింగ్ షో నుంచే ఈ చిత్రం ప్లాఫ్ టాక్ ను సొంతం చేసుకుంది. అభిమానులు మరియు ప్రేక్షకుల అంచలనాలను కొరటాల ఏ మాత్రం రీచ్ కాలేకపోయాడు. అయితే ఆచార్యకు వచ్చిన నెగటివ్ టాక్తో చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. చరణ్ ఇటీవలె రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే రాజమౌళితో సినిమా చేశారంటే ఆయా హీరోల తదుపరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడతాయనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. ఈ సెంటిమెంట్ ఎఫెక్ట్ చరణ్ తదుపరి చిత్రామైన `ఆర్సీ15` పై ఎక్కడ పడుతుందో అని ఆయన అభిమానలు తెగ ఆందోళన చెందారు. కానీ, ఇంతలోనే మెగా మల్టీస్టారర్ అయిన ఆచార్య విడుదలై.. రాజమౌళి సెంటిమెంట్కు బలైపోయింది.
దీంతో `ఆర్సీ 15` సేఫ్ అని, రాజమౌళి సెంటిమెంట్ గండం నుంచి చరణ్ బయటపడ్డాడని అంటూ ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, `ఆర్సీ 15` విషయానికి వస్తే.. ఇండియన్ స్టార్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే కొంత మేర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.