Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్తో అంచలంచలుగా ఎదుగుతూ మెగా పవర్ స్టార్గా స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే భారీ సంఖ్యలో అభిమానులు సైతం సందించుకున్నారు. అయితే వారిలో ఓ వీరాభిమాని తాజాగా ఊహించిన గిఫ్ట్ ఇచ్చి చరణ్ను ఫిదా చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణలోని గద్వాల జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి.. తన పొలంలో పండించిన ధాన్యంతో రామ్ చరణ్ బొమ్మ గీశాడు. ఆపై ఆ బొమ్మను, అలాగే తాను కష్టపడి పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్ నివాసానికి చేరాడు. ఈ విషయం తెలుసుకున్న చరణ్.. వెంటనే సదరు అభిమానిని కలిశాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తన అభిమాన హీరోను దగ్గర నుంచి చూసి ఉప్పొంగిపోయిన సదరు అభిమాని.. బియ్యపు గింజలతో తాను వేసిన బొమ్మ గురించి వివరించి చెప్పాడు. అంతే కాదు తాను పండించిన వాటిలో రెండు బస్తాల బియ్యాన్ని రామ్ చరణ్ కు గిఫ్ట్గా ఇచ్చి ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
కాగా, చరణ్ సినిమాల విషయానికి వస్తే.. `ఆర్ఆర్ఆర్` అనంతరం ఈయన శంకర్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను ప్రారంభించాడు. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యహరిస్తున్నారు. భారీ అంచానలు ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పూర్తైన `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఈ మూవీ పట్టాలెక్కించనున్నాడు.
An ardent fan named Jairaj creates an artistic portrait of #RamCharan with rice crops in his paddy field in Gorlakhan Doddi, Gadwal.
He walked 264 KMs to meet @AlwaysRamCharan and explain about his artefact. pic.twitter.com/pkbOnVcRJQ
— Suresh Kondi (@SureshKondi_) May 28, 2022