Ram charan: పుష్ప: ది రైజ్ పార్ట్ 1 సినిమా అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్కే బాగా ప్లస్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది డిసెంబర్ 17న రిలీజైంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషలలో రిలీజ్ చేయగా అల్లు అర్జున్ స్టామినా ఏంటో నిరూపించింది. ఈ సినిమా అన్నీ భాషలలో సూపర్ హిట్ అవడం చాలా కష్టమనే టాక్ వినిపించింది. ఇక హిందీలో అయితే పట్టుమని పదిరోజులు కూడా ప్రమోషన్స్ నిర్వహించకపోవడంతో అసలు హిందీలో పుష్ప పార్ట్ 1 ఎవరైనా చూస్తారా అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
కానీ, అలాంటి కామెంట్స్కు పూర్తి భిన్నంగా పుష్ప హిందీలో ఊహించని విధంగా భారీ వసూళ్ళు రాబట్టి షాకిచ్చింది. హిందీ మార్కెట్ మీద ఎప్పటి నుంచో పట్టు తెచ్చుకోవాలనుకున్న హీరో అల్లు అర్జున్కు ఈ సినిమా అది సాధించింది. దర్శకుడిగా సుకుమార్కు బాలీవుడ్లో మంచి క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఇక మిగతా మూడు భాషలలో కూడా పుష్ప చిత్రానిదే పైచేయి అని చెప్పుకునే రేంజ్ వసూళ్ళు రాబట్టింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమా మెగా పవర్ స్టార్ రాం చరణ్కు ప్లస్ అయింది. అదెలాగా అని అందరూ అనుకోవచ్చు.
Ram charan: రంగస్థలం సినిమాలను హిందీ వెర్షన్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా రంగస్థలం. సమంత ఇందులో హీరోయిన్గా నటించింది. అయితే సుకుమార్కు పుష్ప సినిమాతో బాలీవుడ్లో మంచి పేరు రావడంతో ఆయన గత చిత్రం రంగస్థలం హిందీలో డబ్బింగ్ చేయబోతున్నారు. దాంతో ఇది చరణ్కు ప్లస్ అవుతోంది. అసలు ఈ సినిమాను మళ్ళీ హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని ఎవరూ భావించలేదు. పుష్ప బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ కావడంతో అల్లు అర్జున్ గత బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో, సుకుమార్ రంగస్థలం సినిమాలను హిందీ వెర్షన్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.