ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఆ ప్రాజెక్ట్ తర్వాత ఏం చేయబోతున్నారు? ఏ డైరెక్టర్తో సినిమా చేయనున్నారన్న చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. వంశీ పైడిపల్లితో ఓ సినిమా ఉందన్న టాక్ కూడా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. చెర్రీ కొత్త ప్రాజెక్ట్పై ఆసక్తికర వార్తలు ప్రచారంలో వచ్చాయి. కార్తీకి ‘ఖైదీ’తో సూపర్ హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్తో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. వంద కోట్లకు పైబడిన వసూళ్లతో ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ అయిన లోకేశ్.. తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ప్రచారం జరుగుతోంది. రామ్చరణ్ ఇప్పటికే లోకేశ్తో చర్చలు జరిపారని… సినిమాపై త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. లోకేశ్ ప్రస్తుతం .. తమిళ స్టార్ హీరో విజయ్తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇవ్వడానికి లోకేశ్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
previous post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!