మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” విజయంతో మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన కెరీర్ లో 15వ సినిమా చేస్తున్నారు. “RC 15” అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాలో చరణ్ 3 విభిన్నమైన పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఇక శంకర్ సినిమా తర్వాత చరణ్ నెక్స్ట్ గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
ఇక ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడు చరణ్ మరో ప్రాజెక్ట్ పై అది కూడా పవన్ మిస్ చేసుకున్న ప్రాజెక్టుని టార్గెట్ చేసినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. రాజకీయాలనుండి సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చాక పవన్ ఎక్కువగా రీమిక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్… చేయడం జరిగింది రెండు సూపర్ హిట్ అయ్యాయి. రెండు కూడా రీమిక్ సినిమాలే. ఇదే సమయంలో “వినోదయ సితం” అనే రీమిక్ సినిమా కూడా త్వరలో పవన్ చేయనున్నారు.
అయితే తమిళంలో విజయ్ నటించిన “తేరి” సినిమా తెలుగులో పవన్ రీమిక్ చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా తెలుగులో ఆ టైంలోనే “పోలీసోడు” అనే టైటిల్ తో విడుదల అయింది. తెలుగులో చాలామంది చూడటంతో పవన్ “తేరి” రీమేక్ విషయంలో డ్రాప్ కావటం జరిగిందట. అయితే ఇప్పుడు ఈ సినిమాపై రామ్ చరణ్ కన్నేసినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తుంది. యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో “సాహో” దర్శకుడు సుజిత్ ఈ ప్రాజెక్టు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి వస్తున్న ఈ వార్తల్లో వాస్తవమేంటో త్వరలో తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన “తేరి”లో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది.