Ram charan: నాన్నతో కలిసి నటించాలనుకోలేదు.. అని తాజాగా ఆచార్య మూవీపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కలిసి నటిస్తున్న మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య’. ఈ సినిమాను దేవాదాయ శాఖలో జరిగే అవినీతి నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అలాగే, ఈ సినిమాలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ కూడా ఉండబోతుంది.
మెగా మల్టీస్టారర్ను ఇలాంటి ఎలిమెంట్స్తో డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇద్దరు పెద్ద హీరోలను పెట్టి మల్టీస్టారర్ సినిమా చేయాలంటే అదో పెద్ద సాహసం. ఆ సాహసాన్ని కొరటాల చేసి దాదాపు సక్సెస్ అయినటే. సినిమా గనక ప్రేక్షకులను మెప్పిస్తే..కొరటాలకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆయన నుంచి ఆచార్య లాంటి మల్టీ స్టారర్ చిత్రాలు మరిన్ని వస్తాయి. అయితే, ముందుగా ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరిగింది. కానీ, కోవిడ్ వల్ల బడ్జెట్ పరిమితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకే, మహేశ్ కాకుండా కొరటాల ఈ పాత్రకు చరణ్ను ఒప్పించారు.
Ram charan: నాన్న – నేను కలిసి నటించాలనే ఆలోచనతో ఆచార్య మొదలవలేదు
ఇక చరణ్ కావాలని ఈ సినిమాలో నటించలేదని తెలిపారు. మంచి స్క్రిప్ట్ కుదిరింది తప్ప…నాన్న – నేను కలిసి నటించాలనే ఆలోచనతో ఆచార్య మొదలవలేదని అన్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టే ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమా చేస్తూ కూడా ఆచార్య సినిమాకు డేట్స్ సర్దుబాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్. చిరు సరసన చందమామ కాజల్, చరణ్ సరసన మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జతకట్టారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీది భారీ అంచనాలు నెలకొల్పాయి. ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ఈ సినిమాను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.