Ram charan: మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఈ మధ్య ఓటీటీ కోసం వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. డిజిటల్ ఎంట్రీ ఇస్తూనే క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య, సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, నాగార్జున లాంటి వారందరూ ఈ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అయితే, ఇంతకముందు బాలీవుడ్ మూవీ చేసి హిందీ సీమలో అడుగుపెట్టిన చరణ్ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారట. తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది.
చరణ్, తారక్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. అలాగే, తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న ఆర్సీ 15 కూడా తాజాగా కొత్త షెడ్యూల్ను మొదలుపెట్టారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు చరణ్. పాన్ ఇండియా సినిమాగా దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న చరణ్ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారట.
Ram charan: త్వరలో అధికారికంగా చరణ్ డిజిటల్ ఎంట్రీని కన్ఫర్మ్
దిగ్గజ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో నటించడానికి ప్రస్తుతం చరణ్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ సూపర్ హిట్ అమెరికన్ సిరీస్ను భారతీయ ప్రేక్షకుల కోసం రీమేక్ చేయడానికి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. బాలీవుడ్ నటి నటులను ముందు ఈ సిరీస్ కోసం ఎంపిక చేసుకోవాలనుకున్నారట. అయితే, పాన్ ఇండియా క్రేజ్ ఉన్న చరణ్ అయితే ప్రాజెక్ట్కు బాగా ప్లస్ అవుతుందని సౌత్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారట. త్వరలో అధికారికంగా చరణ్ డిజిటల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రామ్ చరణ్ కూడా ఓటీటీల కోసం వచ్చారంటే ఇక క్రేజీ ప్రాజెక్ట్స్ చాలానే వస్తాయి.