Ram Charan: రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతరామరాజు పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అలాగే, జెర్సీ ఫేమ్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
అంతేకాదు, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ అందుకున్న చరణ్ ఇప్పుడు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇకపై చరణ్ ఓకే చేసే ప్రతి సినిమానూ పాన్ ఇండియా రేంజ్లోనే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదే క్రమంలో త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన తెలుగు స్టార్ హీరోలు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Ram Charan: పాన్ ఇండియన్ రేంజ్ వెబ్ సిరీస్తో..
ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ కూడా సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాంటి ఓ పాన్ ఇండియన్ రేంజ్ వెబ్ సిరీస్తో చరణ్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. త్వర లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. కాగా, ఈ నెల 29న తండ్రి మెగా స్టార్ చిరంజీవితో కలిసి నటించిన భారీ చిత్రం ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్. కొరటాల శివ దీనికి దర్శకుడు. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్.