RC15: ఇటీవల విడుదలైన `ఆర్ఆర్ఆర్`తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
జయరామ్, అంజలి, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి కాగా.. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల 2వ వారం నుంచి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడట. అంతేకాదండోయ్ వాటిలో ఒక పాత్ర పూర్తి నెగెటివ్ గా ఉంటుందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. చరణ్ తండ్రి, ఇద్దరు కొడుకులుగా కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందులో ఓ కొడుకు పాత్ర నెగెటివ్ యాంగిల్లో వుంటుందనీ, ఆ పాత్ర సినిమాకే హైలైట్గా నిలిచిపోతుందని ప్రచారం జరుగుతోంది. కాగా, చరణ్ తన ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ త్రిపాత్రాభినయం చేయలేదు. అయితే ఇప్పుడు శంకర్ మూవీలో అలా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే మెగా ఫ్యాన్స్కి కన్నుల పండగే అవుతుంది.