Ram Charantej: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు. చిరంజీవి వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ అయ్యేలా.. నటనలో వైవిధ్యం చూపుతూ … దమ్మున్న పాత్రలను చేస్తున్నాడు. “రంగస్థలం” లో… చెవిటి వాడిగా చిట్టిబాబు క్యారెక్టర్ లో ఇరగదీయడం జరిగింది. చరణ్ నటనకు ఇండస్ట్రీలో మహామహులు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” లో అల్లూరి సీతారామ రాజు క్యారెక్టర్ కి చెర్రీ దక్షిణాదితోపాటు నార్త్ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ కావడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“ఆర్ఆర్ఆర్” సినిమా మొత్తానికి చరణ్ క్యారెక్టర్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఇప్పుడు చరణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. జంజీర్ టైంలో విమర్శించిన బాలీవుడ్ మీడియా.. ఇప్పుడు చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తింది. “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ సమయంలోనే నార్త్ లో చాలా చోట్ల చరణ్ వెంట అభిమానులు పడటం మనం చూశాం. ఇదిలా ఉంటే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్.. పంజాబ్ లో అమృత్సర్ లో జరుగుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ తరుణంలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతాలలో రామ్ చరణ్ తేజ్ ని చూడటానికి .. నార్త్ ఆడియన్స్ ఎగబడుతున్నారట. సెల్ఫీలు కోసం చరణ్ నీ చుట్టుముడుతున్నరట. పంజాబ్ లో ఏ ప్రాంతానికి వెళ్లిన షాకుల మీద షాకులు ఇస్తున్నారట.. నార్త్ సినిమా ప్రేమికులు. దీంతో అయ్యప్ప దీక్షలో ఉన్నాగాని చరణ్.. సెల్ఫీలు ఇవ్వటంలో చాలా ఓపికగా వ్యవహరిస్తున్నారట. పోలీసులు, ఆర్మీలో.. ఉన్న జవాన్లు కూడా ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో బిఎస్ఎఫ్ సైనికులతో ఫోటోలు దిగి వారికి తన వ్యక్తిగత చెఫ్ ద్వారా వంటలు వండించి వారితో అల్పాహారం తీసుకోవటం జరిగింది. ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తోంది. గతంలో చరణ్ నటించిన “వినయ విధేయ రామ” అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో మళ్లీ తెలుగులో చేయలేదు. ఇప్పుడు మరోసారి చరణ్ సరసన.. శంకర్ దర్శకత్వంలో చేస్తూ ఉంది. ఏది ఏమైనా “ఆర్ఆర్ఆర్” తర్వాత చరణ్ కి నార్త్ లో మాత్రం క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని ఇండస్ట్రీ టాక్.