NTR-Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజమౌళి దాదాపు నాలుగేళ్ల శ్రమించి రూపొందించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ డివివి దానయ్య హై బడ్జెట్తో నిర్మించారు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
ప్రపంచవ్యాప్తంగా మే 25న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఈ చిత్రంలో చరణ్ ఎక్కువ హైలైట్ అయ్యాడని.. ఎన్టీఆర్ను తొక్కేశారనే వాదన రిలీజ్ అయినప్పటి నుంచీ వినిపిస్తోంది. ముఖ్యంగా చివరి అరగంటలో తారక్ పాత్రను తగ్గించేశారని అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. `ఆర్ఆర్ఆర్` సినిమా వెయ్యి కోట్ల దిశగా పరుగులెడుతున్న నేపథ్యంలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఇందుకు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్యలతో సహా తదితరులు హాజరు అయ్యారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ మీడియాతో ముచ్చటించింది.
అయితే ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్.. `తారక్ కన్నా చరణ్ ఎక్కువ మార్కులు కొట్టేశాడని అంటున్నారు..దీనిపై మీరేం అంటారు..?` అంటూ ప్రశ్నించింది. నిజానికి ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఒకరిని పొగుడుతూ ఇలాంటి ప్రశ్న వేయడం మరొకరికి ఎంతో అవమానకరంగా ఉంటుంది. ఇలాంటి అనుభవమే నిన్న ఎన్టీఆర్కు ఎదురైంది.
దాంతో వెంటనే చరణ్ అందుకుని.. `అసలు డామినేషన్ అనే మాటను నేను నమ్మను. అందులో నిజం లేదు. ఇద్దరం చాలా బాగా చేశాం. తారక్ నటన అద్భుతంగా ఉంది. ఆర్ఆర్ఆర్ కోసం తారక్తో చేసిన ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళికి కృతజ్ఞతలు. తారక్పై నా ప్రేమ అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది` అంటూ చెప్పుకొచ్చారు. అడగకూడని ప్రశ్న వేసి బాలీవుడ్ మీడియా ఎన్టీఆర్ను అవమానించినా.. అందుకు చరణ్ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చి ఫ్యాన్స్ను కూల్ చేశాడు.