Ram Charan : రామ్ చరణ్ Ram Charan గతంలో అభిమానులకు, హీరోలకు కాస్త దూరం ఉండేది. ఇంటికో, షూటింగ్ స్పాట్ కో వెళ్లి కలవాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చి వారిద్దరి మధ్య దూరాన్ని బాగా తగ్గించేసింది. ఇప్పుడు ఇదే టెక్నాలజీ ఓ మహిళా అభిమాని తన ఫేవరెట్ హరోని దగ్గరగా కలిసేలా చేసింది. శ్రీమతి సుదర్శన్ బొడ్డు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వీరాభిమాని. తన ఫేవరెట్ హీరోను ఆమె కలవాలనుకున్నారు. ఇందుకు ఆయన ఇంటివద్దో, షూటింగ్ వద్దో కలిసి ఓ ఫొటో దిగాలనుకోలేదు. తన హీరోకు అభిమానిగా ప్రత్యేకంగా నిలవాలని భావించారు.
ఇందుకు తనకు ఉన్న కళ ద్వారా ఆ కలను సాకారం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. చీపురుపుల్లలతో ఒక అందమైన డ్రీమ్ హౌస్ నిర్మించి రామ్ చరణ్ కు బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. వెంటనే చీపురుపుల్లలతో ఒక అద్ఢుతమైన డ్రీమ్ హౌస్ ను చీపురుపుల్లలతో తయారు చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుని.. ‘మీ కోసం ఈ బహుమతి తయారు చేసాను.. మిమ్మల్ని కలసి ఇవ్వాలనుంది’ అని పోస్ట్ చేశారు. దీంతో ఆమె తయారుచేసిన ఇల్లు, అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మెగా ఫ్యాన్స్ ఆ మహిళా అభిమాని అభిమతాన్ని రామ్ చరణ్ కు తెలియజేశారు.
మార్చి 27న తన పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ను ఈనెల 25న హైదరాబాద్ లో కలుసుకున్నారు. ఇదే వేదికపై రామ్ చరణ్ శ్రీమతి సుదర్శన్ బొడ్డును కలిసే ఏర్పాట్లు చేశారు. ఆమె కల నెరవేరింది. తన అభిమాన హీరోను దగ్గరగా చూసి మురిసిపోయారు. తాను తయారు చేసిన డ్రీమ్ హౌస్ బహుమతిని రామ్ చరణ్ కు అందించారు. రామ్ చరణ్ ఆమె కష్టాన్ని గుర్తించారు. ఆ బహుమతిని చూసి మురిసిపోయారు. ఆమె చేతుల మీదుగా ఆ ఇంటిని తీసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ కు రామ్ చరణ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంటూ సోషల్ మీడియాలో మెగాభిమానులు మురిసిపోతున్నారు.