‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని దర్శకుడు ఆర్జీవీ వాపోయారు. తమ చిత్రం విడుదల కాకుండా రెండు వారాలు ఆలస్యం చేశారని.. దీనివల్ల తమ చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున నష్టపోయిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో తన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఈ సినిమాను అడ్డుకున్న వారిపై పరువునష్టం దావా వేస్తున్నట్టు ప్రకటించారు. సినిమాపై దుష్ప్రచారం చేసిన ఇంద్రసేన చౌదరి, కేసులు పెట్టిన కేఏ పాల్ సహా మరో నలుగురిపై 20 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్టు వర్మ తెలిపారు. ఇది ఒక సెటైరికల్ మూవీ అని తాను ముందునుంచి నుంచీ చెబుతున్నప్పటికి కొంత మంది ఉద్దేశపూర్వకంగా సినిమాను అడ్డుకున్నారన్నారు.
ఈ సినిమా వివాదం హైకోర్టుకు చేరడంతో సినిమా విడుదలలో ఆలస్యమైంది. సెన్సార్ బోర్డు పలు మార్పులు, చేర్పులు చెప్పడంతో.. పేరు కూడా మార్చాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 12న విడుదలైన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ బాక్సాఫీస్ దగ్గర పాజిటీవ్ టాక్ రాబట్టలేకపోయింది.