నిజ ఘటనలను, బయోపిక్స్ను తెరకెక్కించడంలో దిట్ట వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం ఈయన డైరెక్ట్ చేసిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎలక్షన్స్ కమిటీ, సెన్సార్ బోర్డు, కోర్టులు ఇలా అన్ని అడ్డంకులను దాటుకున్న `లక్ష్మీస్ ఎన్టీఆర్`ను మార్చి 29న విడుదల చేయడానికి వర్మ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా యాంకర్ తదుపరి ఎవరి బయోపిక్ను తెరకెక్కించాలని అనుకుంటున్నారు అని అడిగితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అని ఏమాత్రం తడుము కోకుండా చెప్పేశాడు రాంగోపాల్ వర్మ. కె.సి.ఆర్ లైఫ్లో చాలా డ్రామా ఉందని.. కాబట్టి ఆయన బయోపిక్ను తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఈ బయోపిక్ తెరకెక్కించడానికి కె.సి.ఆర్ పర్మిషన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాడట వర్మ. ఈయన ప్రస్తుతం తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్`.. దివంగత నేత సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశం తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా చిత్రీకరించబడింది.
previous post
next post