Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 11,666 మెజార్టీతో గెలవడం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో బీజేపీ ప్రారంభంలో మంచి పోటీ ఇచ్చింది. వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అటువంటివి నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవడం టిఆర్ఎస్ గెలవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సరిగ్గా వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ గెలవడం ఆ పార్టీ నేతలలో మరియు కార్యకర్తలలో జోష్ నింపింది. ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వ్యవహరించిన తీరు నవ్వులు పూయించడం తెలిసిందే.
రైతుల మాదిరిగా వేషధారణ ఇంకా కటింగ్ షాపులలో… కటింగ్ చేయించుకోవడం మీడియా ముందు పడుకుండిపోవడం వంటివి చేయడం జరిగింది. ప్రచారంలో ఆయా చోట్ల ప్రజలతో కలిసి స్టెప్పులు కూడా వేశారు. కేఏ పాల్ డాన్స్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలో కూడా ఇంకా గెలవకుండానే విజయోత్సవ ర్యాలీకి అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే 600కు పైగా ఓట్లు రాబట్టారు. కానీ జరిగిన ఉప ఎన్నికలలో తనకి లక్షన్నర ఓట్లు పడినట్లు యువత ఓట్లన్నీ తనకే అన్నట్లు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నలుగురు అబ్జర్వర్లు తనని ప్రశంసించినట్లు కూడా తెలిపారు. మధ్యాహ్నం 12:00 వరకు 60 ఓట్ల లెక్కిస్తే తనకు 600 కూడా రాలేదని ఈవీఎంలు ట్యాపింగ్ అయ్యాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపించారు.
ఉంగరం గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా కేఏ పాల్ పోటీ చేశారు. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలలో ఓడిపోయిన కేఏ పాల్ పై రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. “పాల్ తన ఫ్రెండ్స్ ఐసిస్, అల్ ఖైదా ఉపయోగించి మునుగోడు నియోజకవర్గంలో బాంబు వేయనున్నాడని… తెలిసింది. అలాగే జీసస్ కి చెప్పి మునుగోడు లో పంటలు పండకుండా.. ప్రజలకు ప్రాణాంతక వైరస్ సోకేలా చేస్తాడని విన్న” అని ట్విటర్ లో చమత్కారంగా ఆర్జీవి కామెంట్లు చేశారు. అంతేకాకుండా 2024 ఎన్నికలలో అమెరికాలో అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచి మునుగోడు నియోజకవర్గం పై న్యూక్లియర్ బాంబు కేఏ పాల్ వేస్తాడేమోనని ఆర్జీవి సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.