Ramajogayya Sastry: టాలీవుడ్లో ప్రముఖ గీత రచయితగా రామజోగయ్య శాస్త్రికి ఎంతటి పేరుందో అందరికీ తెలిసిందే. ఆణిముత్యాల్లాంటి పాటలను రాస్తూ అర్థవంతంగా అందరికీ అర్థమయ్యేలా. అందరికీ చేరువయ్యేలా తన సాహిత్య రచనతో ఆకట్టుకుంటున్నారు. ప్రతీ సంగీత దర్శకుడు ఆయనతో పాట రాయించుకోవాలని, ప్రతీ దర్శకుడు, హీరో తను రాసిన పాట తమ సినిమాలలో ఉండాలని కోరి మరీ ఆయనతో ఒక్క పాటైనా రాయించుకుంటున్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి లాంటి ఆ తరం గొప్ప సాహిత్య రచయితలతో పాటు ఈ తరం శ్రీమణి, అనంత శ్రీరామ్, చంద్రబోస్ లాంటి వారికి ఉన్న ప్రత్యేకతకు సమానంగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు స్టార్ హీరోల సినిమాలలో పాటలు రాస్తున్నారు. వకీల్ సాబ్
సినిమాలో మగువ మగువా లాంటి అద్భుతమైన పాటలు వచ్చి హిట్ సాధించాయి.
Ramajogayya Sastry: నామట్టుకు నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం..
అయితే, దీనంతటికి కారణం ఆయనలోని ప్రతిభను గుర్తించిన అగ్ర దర్శకుడు శ్రీను వైట్ల. 15 ఏళ్ళ క్రితం వచ్చిన ఢీ సినిమాలో రామజోగయ్య శాస్త్రి తోటి శ్రీను వైట్ల పాటలు రాయించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అప్పటి నుంచి వరుసగా సినిమాలలో పాటలు రాస్తూ గొప్ప పేరు తెచ్చుకొని ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ రామజోగయ్య శాస్త్రి తాజాగా సొషల్
మీడియాలో ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు. అందులో ఆయన ..థాంక్యూ డియర్ శ్రీనువైట్ల గారు, నేనింత వరకూ రావడంలో మీ పాత్ర మరువలేనిది. తొలిరోజుల్లో ఒక ప్రతిభను గుర్తించడం, నమ్మడం మీరు నాకు చేసిన మేలు. ‘ఢీ’, నామట్టుకు నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం…అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Thanku dear @SreenuVaitla garu💕
నేనింతవరకూ రావడంలో మీ పాత్ర మరువలేనిది…తొలిరోజుల్లో ఒక ప్రతిభను గుర్తించడం నమ్మడం మీరు నాకు చేసిన మేలు..ఢీ…నామట్టుకు నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం..మన టీమ్ అందరికీ శుభాకాంక్షలు 💕 https://t.co/9vFxFPV4cX
— RamajogaiahSastry (@ramjowrites) April 13, 2022