Prabhas: ప్రభాస్ తో సినిమా చేయడం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇండియాలో ఏ ఇండస్ట్రీకి చెందిన వారైనా. ప్రభాస్ ఒప్పుకోవాలే గాని ఇండియాలో టాప్ మోస్ట్ నిర్మాణ సంస్థలు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాయి. “బాహుబలి” సినిమా తో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి మార్కెట్ ఉండటంతో.. చాలామంది టాప్ మోస్ట్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా చేయాలని.. తహతహలాడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో సలార్.. జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యాం” సినిమా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో “సలార్” మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరోసారి ప్రభాస్ తో నటిస్తున్నట్లు ఫిలిం వర్గాల లేటెస్ట్ టాక్ వినబడుతోంది.
ఆల్రెడీ ప్రభాస్ నటించిన “బాహుబలి” సినిమాలో శివగామి పాత్ర చేసి.. సినిమా మొత్తానికి అప్పట్లో రమ్యకృష్ణ హైలెట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమా తర్వాత ‘లైగర్’, ‘రిపబ్లిక్’ సినిమాల్లో నటిస్తున్న రమ్యకృష్ణ .. మరోసారి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న “సలార్” మూవీలో కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించి రమ్యకృష్ణతో డిస్కషన్లు జరిగినట్లు, అంతా ఓకే అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
“బాహుబలి” తర్వాత వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్న ప్రభాస్ మరోసారి ఈ సినిమా అయిన వెంటనే ఇంకో సినిమా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా సరికొత్త మాస్ సబ్జెక్ట్ అని ఫిలిం మేకర్స్ అంటున్నారు. “బాహుబలి” విజయం తర్వాత రమ్యకృష్ణ కి భారీ ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్ తో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో రావడంతో అభిమానులు .. ఈ వార్త కన్ఫర్మ్ అయితే బాగుంటుంది అంటూ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు.