Rana Daggubati: రానా దగ్గుబాటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో పవన్కు జోడీగా నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు.
భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న విడుదలైన ఈ మూవీ మొదటి రోజే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఈ మూవీలో రిటైర్డ్ ఆర్మీ అధికారి డేనియర్ శేఖర్ పాత్రను అద్భుతంగా పోషించి నటన పరంగా రానా మరో మెట్టు ఎక్కేశాడు.
దీంతో సినిమా చూసిన వారందరూ రానాను పొగడ్తలతో ముంచెత్తారు. మొత్తానికి ప్రస్తుతం సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న రానా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా పవన్ గురించి మాట్లాడుతూ.. `ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. కానీ, ఈ సినిమా ద్వారా పవన్కు బాగా కనెక్ట్ అయ్యా, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నా` అంటూ రానా చెప్పుకొచ్చాడు.
టీమ్ అందరి కృషితోనే భీమ్లా నాయక్ మంచి విజయం సాధించిందని పేర్కొన్న రానా.. `తనకు, సంయుక్త మీనన్ కు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని చాలా చెబుతున్నారు. తనకు పెళ్లవ్వడం వల్లే సంయుక్త తో అంత బాగా నటించగలిగాను. పెళ్ళైన అనుభవం ఈ మూవీలో ఎంతగానో ఉపయోగపడింది` అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. కాగా, రానా ప్రస్తుతం బాబాయ్ వెంకటేష్తో కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.