Rana Daggubati: ‘భీమ్లా నాయక్’ సీక్వెలా..అంత సీన్ లేదనేలా తాజాగా టాలీవుడ్ టాల్ హీరో రానా కామెంట్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రమే ‘భీమ్లా నాయక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో మలయాళ బ్యూటీస్ నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. గత నెల 25న వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది.
సాధారణంగా ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే, మన వాళ్ళు ఆ సినిమాకు సీక్వెల్ చేయా లని డిసైడైపోతారు. బాహుబలి సిరీస్ కూడా అంతే. ముందు ఒక భాగమే అని రంగంలోకి దిగిన రాజమౌళి బృందం ఆ తర్వాత కథకు సీక్వెల్ చేసే స్కోప్ ఉండటంతో బాహుబలి కన్క్లూజన్ అని సీక్వెల్ను నిర్మించారు. రెండు భాగాలు అఖండ విజయాన్ని అందుకు న్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేయడమే కాకుండా ఓ కొత్త చరిత్ర సృష్ఠించారు బాహుబలి సినిమా సీక్వెల్స్తో రాజమౌళి. ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్గానూ మారారు.
Rana Daggubati: సీక్వెల్ సినిమాను తీసే స్కోప్ లేకపోవచ్చు..!
అయితే మళ్ళీ ఇంతకాలానికి అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 వచ్చి ఊహించని సక్సెస్ అందుకుంది. త్వర లో పుష్ప పార్ట్ 2 షూటింగ్ మొదలవబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాకు కూడా మేకర్స్ సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వచ్చి జోరుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇదే విషయం తాజాగా రానా వద్ద
ప్రస్తావించగా..ఈ సినిమా కథ ఆల్రెడీ ముగిసిందని..దీనికి సీక్వెల్ సినిమాను తీసే స్కోప్ లేకపోవచ్చునని క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా మలయాళ వెర్షన్లో కూడా ఈ సినిమాను ఒకే భాగంలో ముగించారు. అక్కడ కూడా సీక్వెల్ చేసే ఆలోచనలో మేకర్స్ లేరు. అందుకే రానా ఇక్కడ ఇలా సమాధానమిచ్చారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?