Rana Daggupatti:దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పేరు విరాట పర్వం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక తాజాగా కరోనా తరువాత ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి, బాక్షాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ డేట్ ని ప్రకటించక పోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rana Daggubati: ‘భీమ్లా నాయక్’ సీక్వెలా..అంత సీన్ లేదన్న రానా కామెంట్స్ వైరల్..!
Rana Daggupati: అస్సలు ఈ సినిమాను రిలీజ్ చేస్తారా?
ఈ అనుమానం కూడా ప్రేక్షకుల్లో కూడా వుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వచ్చినా అందులో కుండా క్లారిటీ లేదు. అయితే ఈ వార్తలపై రానా స్పందిస్తూ అలాంటిది లేదని, సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుతుందని ఒకసారి క్లారిటీ ఇచ్చాడు. దీంతో రానా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకతాజాగా మరోసారి ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.
Rana Daggubati: నీది యాక్టింగ్ కాదు.. రానాను ముఖంపైనే తిట్టేసిన స్టార్ హీరో!
OTT భారీ డీల్?
ఈ సినిమాకు OTT భారీ డీల్ కూడా ప్రకటించిందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది . ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్మాతలకు దాదాపు రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని, ఇందులో రూ.41 కోట్లు డిజిటల్ రిలీజ్కి, రూ.9 కోట్లు శాటిలైట్ హక్కులకి ఇస్తామని బంఫర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ ని సురేష్ బాబు తీసుకున్నాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఓటీటీ విడుదలకు రానా ఈసారైనా ఒప్పుకుంటాడా..? లేదో తెలియాలి.