Rana-Naga Chaitanya: టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్గా గుర్తింపు పొందిన నాగచైతన్య, సమంతలు కొద్ది నెలల క్రితమే ఎవరి దారి వారు చూసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈ జంట.. వివాహమై నాలుగేళ్లు గడవక ముందే విడాకుల వైపు టర్న్ తీసుకున్నారు. వీరు ఎందుకు విడిపోయారు అన్న దానిపై ఇంత వరకు సరైన స్పష్టత రాలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా రానా దగ్గుబాటి చేసిన ట్వీట్ నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగ చైతన్య నటించిన తాజా చిత్రం `థ్యాంక్యూ`. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కొద్ది నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జులై 8న థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ను నిన్న మేకర్స్ బయటకు వదిలారు. ఈ టీజర్ను చైతు ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. `నన్ను నేను సరి చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయాణమే థాంక్యూ` అని క్యాపన్ ఇచ్చాడు.
అయితే ఈ ట్వీట్పై స్పందించిన రానా.. ‘నువ్వు ఇప్పటికే సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్స్` అని రిప్లై ఇచ్చాడు. దీంతో రానా కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. సామ్-చై విడాకులపై రానా కావాలనే అలా ఇన్డైరెక్ట్ కామెంట్ చేశాడని, సామ్ విషయంలో రానా సైలెంట్గా వేసేశాడని, సామ్ను వదిలిన దగ్గర్నుంచి చై సరి అయ్యాడా అని నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రానా ట్వీట్ కాస్త వైరల్గా మారింది.
Nuvvu already sari aiyipoyyavu brother 😝 superb teaser guy! Best wishes @Vikram_K_Kumar @RaashiiKhanna_ https://t.co/9s6qhMpLCx
— Rana Daggubati (@RanaDaggubati) May 26, 2022