Project K: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా “ప్రాజెక్ట్ కె” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటీనటులు అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశాపటాని మరి కొంతమంది నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి వస్తున్నా వార్తలు సినిమాపై ఉన్న కొద్ది అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై దగ్గుబాటి రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ప్రభాస్ నటిస్తున్న “ప్రాజెక్టు కె” ప్రపంచ సినిమా రంగంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ స్థాయిని పెంచే విధంగా ఉంటుందని చెప్పకొచ్చారు.
ఈ సినిమా కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా సినిమా విజయం సాధిస్తుంది. ఇప్పటివరకు ఉన్న బాహుబలి, RRR రికార్డులను బ్రేక్ చేస్తుంది. నేను ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. కచ్చితంగా ఓ తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని నమ్మకంగా “ప్రాజెక్టు కె” గురించి చెప్పగలను. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరో సినిమాను మరో హీరో సపోర్ట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది చాలా సంతోషించ దగ్గ విషయం. భారతీయ చలనచిత్రాలు విదేశాలలో సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే ఎక్కడైనా ఆదరణ దక్కుతుంది అంటూ దగ్గుబాటి రానా ప్రభాస్ “ప్రాజెక్ట్ కె” గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నాడు అని ప్రచారం జరుగుతుంది. దాదాపు అరగంట పాటు కమల్ పాత్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్ డిజైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇందుకోసం కమల్ హాసన్… ఏకంగా 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే కమల్ “ప్రాజెక్టు కె”లో విలన్ పాత్రకి సంబంధించి కన్ఫామ్ వార్త వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కాబోతోంది.