బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ను ఉద్దేశించి హీరోయిన్ తాప్సీ రీసెంట్గా కౌంటర్ ఇచ్చింది. అక్షయ్కుమార్, తాప్సీ, విద్యాబాలన్, నిత్యామీనన్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ “మహిళకు మరో మహిళ సపోర్ట్ చేయాలని చెప్పే కంగనా `మిషన్ మంగల్`కు ఎందుకు మద్దుతు ఇవ్వలేదు?. ఐదుగురు మహిళలు ఈ సినిమాలో నటించారు కదా.. మరి మద్దుతు ఎందుకు ఇవ్వలేదు? కంగనా కాపీని నేను అనడం నాకేమీ బాధ లేదు. ఎందుకంటే నేను ఆమె జూనియర్ని. అయితే నటిగా నేను కొన్ని మంచి సినిమాలనే చేశానని భావిస్తున్నాను` అంటూ మాట్లాడింది.
దీనికి కంగనా సోదరి రంగోలి కౌంటర్ ఇస్తూ “ఏం సాధించావని నిన్ను పొగడాలి. అక్షయ్, విద్యాబాలన్ నటించిన సినిమాలో రెండు నిమిషాల పాత్ర, అమితాబ్ సినిమాలో ఓ చిన్న పాత్ర చేశావ్. అందుకే నిన్ను పొగడాలా? సినిమా అంతా ఒకేలా హావభావాలిచ్చే నిన్ను ఎందుకు మెచ్చుకోవాలి? నా ప్రశ్నలకు సిల్లీగా కాకుండా హుందాగా స్పందిస్తే స్పందించు.. లేదా వదిలెయ్“ అన్నారు.
ఇప్పుడు తాప్సీ కౌంటర్ ఇస్తుందా? లేక కామ్గా విషయాన్ని వదిలేస్తుందా? అనేది చూడాలి.