Rashi Khanna: `మనం` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ రాశీ ఖన్నా.. 2014లో విడుదలైన `ఊహలు గుసగుసలాడే` సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. తనదైన టాలెంట్తో క్రేజీగా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న రాశీ ఖన్నా.. ఇటీవల `రుద్ర` అనే వెబ్ సిరీస్లో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
ఈ సిరీస్ మంచి విజయం సాధించడంతో రాశీ ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాదిన హీరోయిన్లను వారి ప్రతిభతో కాకుండా లుక్స్ పరంగా గుర్తింపు ఇస్తారని, అది తనకు అసలు నచ్చదని రాశీ ఖన్నా పేర్కొంది. సౌత్ లో తన టాలెంట్కు తగ్గ అవకాశాలు రాలేదని, నటిగా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు కూడా ఆమె వెల్లడించింది.
దీంతో ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చిన దక్షిణాది సినీ పరిశ్రమను విమర్శిస్తావా? అంటూ కొందరు రాశీ ఖన్నాను విపరీతంగా ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ ట్రోల్స్ను సహించలేకపోయిన రాశీ ఖన్నా.. తాజాగా సోషల్ మీడియా ద్వారా స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చింది.
`దక్షిణాది చిత్ర పరిశ్రమను తాను దూషించానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను సౌత్ ఇండస్ట్రీ గురించి ఎలాంటి చెత్త కామెంట్స్ చేయలేదు. నాకు అన్ని భాషలు, అన్ని ఇండస్ట్రీలు సమానమే. తనకు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలు అంటే ఎంతో గౌరవం ఉంది. దయచేసి నాపై తప్పుడు ప్రచారం ఆపండి` అంటూ రాశీఖన్నా ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడీమె పోస్ట్ వైరల్గా మారింది. మరి ఇకనైనా రాశీపై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడుతుందో లేదో చూడాలి.
🙏🏻😊 pic.twitter.com/yQa1nOacEY
— Raashii Khanna (@RaashiiKhanna_) April 6, 2022
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!