దక్షిణాది నటి రాధికా శరత్కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె నేటి ఉదయం పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో శ్రీలంకలో ఆరు చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇప్పటి వరకు ఈ దాడిలో 50 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. ఈస్టర్ డే సందర్భంగా భక్తులను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు ఈ దాడులకు పాల్పడ్డారు.
సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధికా శరత్కుమార్ కొన్ని నిమిషాల ముందుగానే ఆ హోటల్ను ఖాళీ చేసేసి వెళ్లిపోయారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాల్లో ఈ హోటల్ కూడా ఉండటం గమనార్హం. ఈ విషయం తెలిసిన రాధికా శరత్కుమార్.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “నేను హోటల్ను ఖాళీ చేసిన కొద్దిసేపటికే బ్లాస్టింగ్ జరిగింది. దేవుడు నాతో ఉన్నాడు“ అన్నారు రాధికా.
previous post
next post