Vijay Deverakonda Rashmika: హీరోయిన్ రష్మిక మందన రౌడీ విజయ్ దేవరకొండ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి అండమాన్ టుర్ వెళ్ళినట్లు ఇటీవల బాగా ప్రచారం జరిగింది. ఈ ఒక్కసారి మాత్రమే కాదు.. అంతకుముందు కూడా ఒకే స్పాట్ లో రష్మిక మరియు విజయ్ దేవరకొండ ఫోటోలు దిగటంతో పాటు విజయ్ దేవరకొండ స్పెట్స్… రష్మిక పెట్టుకోవడం జరిగింది. కానీ ఇద్దరూ ఆ టూర్ వేరువేరుగా వెళ్ళినట్లు… ముంబై విమానాశ్రయంలో ఫోటోలకు ఫోజులిచ్చారు.
కానీ రీసెంట్ గా వెళ్లిన సమయంలో స్పాట్ నుండి రష్మిక వీడియో రూపంలో అభిమానులతో చిట్ చాట్ చేయడం జరిగింది. ఆ సమయంలో పక్కనే విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. దీంతో ఇద్దరూ కలిసి టూర్ వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాగాని ఎప్పుడూ కూడా నవ్వడం అలవాటని చెప్పుకొచ్చింది. స్కూల్ చదువుతున్న సమయంలో కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉన్నట్లు తెలిపింది. అయితే హాస్టల్లో ఉన్న సమయంలో ఎవరితో కూడా అంతగా పడేది కాదు.
అందరు తప్పుగా అర్థం చేసుకునేవారు. సో నేను పాఠశాలలో చదువుతున్న సమయంలో ఒంటరిగా గదిలో కూర్చుని ఏడ్చేదాన్ని. అయితే నాకు బాధలన్నీ అమ్మకు చెప్పటం అలవాటు. చిన్ననాటి నుండి అనేక బాధలు ఒంటరిగా అనుభవించడంతో చాలా స్ట్రాంగ్.. గా ఉండటం అలవాటు అయిందని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ నేను మంచి ఫ్రెండ్స్. మరి స్నేహితుల అన్నాక టూర్స్ వెళ్లడం అనేది సహజమని రష్మిక తెలియజేసింది. వీరిద్దరూ కలిసి దాదాపు మూడు సినిమాలు నటించడం జరిగింది. అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అనీంటిలో “గీతా గోవిందం” అతిపెద్ద హిట్ అయింది.