టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోరు మీద ఉంది రష్మిక మందన. ఇండస్ట్రీలో చలో సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా తో నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమా ఛాన్స్ కూడా దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. పాన్ ఇండియా సినిమాగా పుష్ప తెరకెక్కనున్న నేపద్యంలో హిందీలో కూడా ఖాతా తెరవడానికి రష్మిక రెడీ అయింది. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానుల తో చిట్ చాట్ చేసిన సందర్భంలో ఓ అభిమాని వేసిన ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది ఈ కన్నడ భామ. మేటర్ లోకి వెళ్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు బయోపిక్ నటించే ఛాన్స్ వస్తే ఎవరి స్టోరీ ఎంచుకుంటారు అని ప్రశ్నించగా.. తాను అలనాటి హీరోయిన్ సైనా దివంగత శ్రీదేవి అదేవిధంగా సౌందర్య జీవిత కథలను సెలెక్ట్ చేసుకుంటానని, అలాంటి ఛాన్స్ వస్తే వదులుకోను అంటూ వీళ్ళిద్దరి సినిమాలు కచ్చితంగా చేస్తాను అంటూ రష్మికా చెప్పుకొచ్చింది.
దీంతో ఇప్పటికే శ్రీదేవి బయోపిక్ చేయాలని అనుకుంటున్నా డైరెక్టర్లకు ఓ హీరోయిన్ అందుబాటులో ఉందని ఈ జవాబు బట్టి చెప్పవచ్చు. దాదాపు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకుంది శ్రీదేవి. అదేవిధంగా సౌందర్య కూడా సౌత్ ఇండస్ట్రీ లో తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకోవడం జరిగింది. అటువంటి ఈ లెజెండ్ హీరోయిన్స్ బయోపిక్ చేయాలని ఉందని రష్మిక మందన తెలపటం ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.