SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 4 బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. లేటెస్ట్ గా సర్కార్ వారి పాట. ఈ నాలుగు సినిమాలు మహేష్ కెరీర్ లో… రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టడం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు మహేష్ ఇద్దరు టాప్ మోస్ట్ దర్శకులతో పని చేస్తున్న సంగతి. డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటు రాజమౌళి తో మహేష్ సినిమాలు చేయబోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు గత నెలలో స్టార్ట్ అయ్యాయి. జూలై నెల నుండి సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా గా ఇండస్ట్రీలో వినపడుతున్న సమాచారం ప్రకారం రెండో హీరోయిన్ గా రష్మిక మందన నీ త్రివిక్రమ్ తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ సెంటిమెంట్ గత కొద్దికాలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కీలక పాత్రలో రష్మిక మందన నీ సెకండ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. రష్మిక మందన గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ నటించిన “సరిలేరు నీకెవ్వరు” లో హీరోయిన్ గా చేయడం తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. 2020లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత రష్మిక మందన నటించిన “పుష్ప” పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని విజయం సాధించడం మాత్రమే కాదు.. ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఈ పరిణామంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్న మహేష్ సినిమాకి సెకండ్ హీరోయిన్ గా రష్మిక మందనకి త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!