టాలీవుడ్ లో రష్మిక మందన్న అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఛలో సినిమాతో పరిచయమైన ఈ కన్నడ బ్యూటి ఆ తర్వాత నటించిన గీత గోవిందం తో తెలుగులో గట్టీ పోటీ ఇస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటి ఇప్పుడు ఏకంగా అయిదు భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది.
ఆ సినిమానే సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప. ఈ సినిమాలో రష్మిక కొత్త యాసను ట్రై చేస్తుంది. సినిమాలో తన పాత్ర కోసం లాక్ డౌన్ లో చిత్తూరు యాస ని ప్రాక్టీస్ చేసిందట. ఇక టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనిపించుకుంటున్న రష్మిక నితిన్ సినిమాలో నటించబోతుందన్న టాక్ ఉంది. ఇప్పటికే నితిన్ రష్మిక కాంబినేషన్ లో భీష్మ వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో మరోసారి నితిన్ తో బాలీవుడ్ రీమేక్ అంధాధున్ లో నటించే అవకాశం అందుకుందని అంటున్నారు.
ఇలా వరసగా టాలీవుడ్ లో మంచి అవకాశాలు, స్టార్స్ సినిమాలు చేస్తున్నప్పటికి మళ్ళీ తన మాతృ భాష అయిన కన్నడ చిత్ర సీమ వైపు చూస్తుంది. ఇపటికే ఒక కన్నడ సినిమా చేస్తున్న రష్మిక ఈ సారి అవకాశం వస్తే తన మాజీ లవర్ తో కలిసి నటించాలన్న కోరిక ఉందటూ ముచ్చట పడుతోంది. వాస్తవంగా అయితే రష్మిక కి ఈ పాటికే పెళ్ళి అయిపోయోది కూడా. రష్మిక కి గతంలో రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ జరిగింది. కాని అదే సమయంలో వరసగా మంచి సినిమాలలో అవకాశాలు రావడంతో జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. అప్పటి నుంచి ఈ ఇద్దరు మళ్ళీ కలవలేదు. కాని అవకాశం వస్తే మాత్రం తనతో నటించాలని చెప్పి రీసెంట్ గా షాకిచ్చింది రష్మిక మందన్న.