కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఛలో, గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్స్టార్ మహేశ్ సరసన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే బాలీవుడ్లో కూడా అడుగుపెట్టనుందని వార్తలు వినపడుతున్నాయి. తెలుగులో నాని హీరోగా నటించిన `జెర్సీ` చిత్రాన్ని రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నాడు. ఈ రీమేక్లో రష్మిక మందన్నాను హీరోయిన్గా తీసుకోవాలని నిర్మాత కరణ్జోహార్ భావిస్తున్నాడట. ఇదే కనుక నిజమైతే.. రష్మిక లక్కీయే.
.
previous post
next post