Rashmika: ఒకప్పుడు ఐటెం సాంగ్స్లో నటించాలంటే హీరోయిన్లు పెద్దగా ఆసక్తి చూపే వారు కాదు. కానీ, ప్రస్తుత రోజుల్లో స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేసేందుకు ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్, తమన్నా, పూజా హెగ్డే వంటి వారు స్పెషల్ సాంగ్స్లో మెరవగా.. మొన్నీ మధ్య సమంత సైతం `పుష్ప` కోసం ఐటెం భామగా మారి `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా` అంటూ ఓ ఊపు ఊపేసింది.
ఇక ఇప్పుడు వీరిని నేషనల్ క్రష రష్మిక మందన్నా కూడా ఫాలో అవ్వబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండతో `అర్జున్ రెడ్డి` తీసి టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో `కబీర్ సింగ్` పేరుతో రీమేక్ చేసి అక్కడా సక్సెస్ అయ్యాడు.
ఇప్పుడీయన ఏకంగా రణభీర్ కపూర్ తో `యానిమల్` అనే ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం రష్మికను తీసుకోవాలిని మేకర్స్ తెగ ట్రై చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే రష్మికను సంప్రదించగా.. ఆమె ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసిందట.
రెండు కోట్లు ఇస్తేనే డేట్స్ ఇస్తానని ఆమె తెగేసి చెప్పిందట. దాంతో నిర్మాతలు రష్మిక అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఏదేమైనా నాలుగు రోజుల్లో పూర్తి అయ్యే ఐటెం సాంగ్కు రెండు కోట్లు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కాగా, రష్మిక ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె తెలుగుతో పుష్ప ది రూల్, హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చేస్తోంది. అలాగే తమిళంలో దళపతి విజయ్తో ఓ మూవీ చేసేందుకు సైన్ చేసింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!