Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమేకాక సౌత్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేతిలో కలిగిన హీరోయిన్ ఎవరు అంటే కచ్చితంగా రష్మిక మందన పేరు ఎక్కువగా వినబడుతోంది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” అనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా కోసం చిత్తూరు యాస కూడా నేర్చుకున్నట్లు ఫిలిం వర్గాల టాక్.
Rashmika Mandanna సుకుమార్ సినిమా మాత్రమే కాక
సుకుమార్ సినిమా మాత్రమే కాక అప్ కమింగ్.., చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టు కలిగిన సినిమాలలో రష్మిక మందన అవకాశాలు అందుకున్నట్లు దీంతో ఈ ముద్దుగుమ్మ పంట మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్న పరిస్థితి. చాలామంది సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో ముంబైలో తాజాగా ఈ టాప్ హీరోయిన్ సరి కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో రష్మిక మందన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీ టౌన్ లో సిద్ధార్థ మల్హోత్రా తో “మిస్టర్ మజ్ను” అనే సినిమా చేస్తూ ఉంది. అయితే ప్రతిసారీ ముంబై కి వెళ్ళిన టైంలో హోటల్ కి భారీగా ఖర్చు అవుతున్న తరుణంలో.. ముంబైలో తనకంటూ పర్మినెంట్ రెసిడెన్సీ ఉండాలి అని డిసైడ్ అయ్యి ఫ్లాట్ తీసుకోవటం జరిగిందట.
ఇదిలా ఉంటే హైదరాబాద్ నుండి కొన్ని వస్తువులను ముంబై లో కొత్తగా కొన్న ఫ్లాటు లోకి రష్మిక మందన షిఫ్టు చేసినట్లు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ మీడియా వర్గాలలో టాక్. మొత్తం మీద అటు బాలీవుడ్ నుండి సౌత్ వరకూ తన హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రెండు చోట్ల తనకంటూ పర్మినెంట్ అడ్రస్ ఉండే రీతిలో సొంతిల్లు ఏర్పాటు చేసుకుంది రష్మిక.