ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీయెస్ట్ హీరోయిన్లలో రష్మిక మందన లీడ్ లో ఉంది. హీరోయిన్ గా రష్మిక క్రేజ్ సినిమాకు హెల్పో అవుతోంది. డియర్ కామ్రేడ్ సినిమానే ఇందుకు ఉదాహరణ. విజయ్ దేవరకొండ – రష్మిక కాంబినేషన్ వల్లు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత అమ్మడి ప్రాజెక్ట్స్ ఏం చేసినా రష్మిక క్రేజ్ అదే స్థాయిలో ఉంటోంది. సంక్రాంతికి మహేశ్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సందడి చేసింది. రీసెంట్ గా ఓ లైవ్ ఇంటరాక్షన్ లో తను సినిమాలు ఎంపిక చేసుకునే పద్ధతి గురించి చెప్పుకొచ్చింది.
‘సినిమాలో నా క్యారెక్టర్ లో ఎమోషనల్ డెప్త్ ఉండి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కథ గానీ నా పాత్ర గానీ ప్రేక్షకులు ఎంటర్ టైన్ అయ్యేలా ఉండాలి. స్క్రిప్ట్ దశలోనే ఇవన్నీ చూసుకుంటాను. ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఇదే తరహాలో చేసినవే’ అంటూ తాను సినిమాలు సెలక్ట్ చేసుకునే పద్ధతి వివరించింది. ఇలా లేని సినిమాలను తాను చేయలేనని అంటోంది. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నా పాత్రలన్నీ ఇలా సెలక్ట్ చేసుకున్నవే. ఈ సెలక్షనే నాకు మంచి గుర్తింపు వచ్చేలా చేశాయి అని చెప్పుకొచ్చింది ఈ కన్నడ బ్యూటీ.
కన్నడలో పెద్ద హిట్ అయిన కిర్రాక్ పార్టీ తర్వాత తెలుగులో ఛలో సినిమా అవకాశం వచ్చింది. మొదటి సినిమాతో హిట్ కొట్టిన రష్మిక రెండో సినిమా గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తోంది.