సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సునీల్ ఇంకా పలు భారీ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలు చేయడం జరిగింది. ఒకటి ఐఏఎస్ ఇంకా స్టూడెంట్, గ్రామ పెద్ద పాత్రలలో చరణ్ నీ శంకర్ చూపిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్ లు బంద్ అయ్యాయి.
ఈ పరిణామంతో RC 15 షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం గ్రాండ్ గా చేయాలని డైరెక్టర్ శంకర్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఒక్క పోస్టర్ లేదా ఫస్ట్ లుక్, టైటిల్ కూడా ప్రకటించలేదు. అయితే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్.. పోస్టర్ మరియు టైటిల్ ప్రకటన చేయటానికి శంకర్ డిసైడ్ అయినట్లు సమాచారం.
ఇందుకుగాను దుబాయ్ లో పెద్ద వేడుకగా చేయాలని ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ నీ చీఫ్ గెస్ట్ గా తీసుకురావడానికి నిర్మాత దిల్ రాజు రెడీ అయినట్లు సమాచారం. మరోపక్క పాన్ ఇండియా స్టార్ యాష్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సందేశాత్మక చిత్రంగా.. ఈ సినిమా ఉండనున్నట్లు.. దీంతో స్వాతంత్ర దినోత్సవం నాడు సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచనతో శంకర్ ఈ ప్లాన్ చేసినట్లు టాక్.