RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరియర్ లో ఈ సినిమా 15వ ది కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నది. టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో… చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా… నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ మూడు డిఫరెంట్ పాత్రలలో కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే అందులో ఒక క్యారెక్టర్ ముఖ్యమంత్రి పాత్ర అని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇటీవల ఈ ఏడాది చివరిలో లేదా దసరా పండుగకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
తాజా అప్ డేట్ ప్రకారం… ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సమ్మర్ కి మార్కెట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ఈ రీతిగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమల్లి పరిసర ప్రాంతాల చుట్టూ జరుగుతోంది. ఫస్ట్ టైం సెన్సేషనల్ డైరెక్టర్ మెగా హీరోతో సినిమా చూస్తూ ఉండటం తో.. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.