RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల వచ్చిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియన్ రేంజ్ సక్సెస్ అందుకున్నారు. ఇందులో ఆయన పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు మెగా అభిమానులు – ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ కెరీర్లో వచ్చిన ఈ ఫస్ట్ మల్టీస్టారర్ మూవీలో తారక్ నటించడం విశేషం కాగా, ఇది దర్శక ధీరుడు రూపొందించిన సినిమా కావడం ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు నమోదు చేయడం మరో గొప్ప విశేషం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ను దృష్ఠిలో పెట్టుకునే చరణ్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో ప్లానింగ్ మార్చారు.
ఇకపై కమిటయ్యే సినిమాల కథలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ముందే ఊహించిన చరణ్ ఏకంగా భారీ బడ్జెట్తో దిల్ రాజు నిర్మిచే సినిమాను ఒకే చేశారు. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పుడు చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ మీద దృష్టి పెట్టారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ నుంచి బయటకు వచ్చిన చరణ్ తన 15వ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్స్ రెడీ చేస్తున్నారు.
RC 15: మేజర్ టాకీ పార్ట్ను శంకర్ కంప్లీట్ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో చరణ్ – శంకర్ల నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్రబృందం పంజాబ్, అమృత్సర్కి వెళుతున్నారట. ఇప్పటికే ఆర్సీ 15 కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్, పూణె, తూర్పు గోదావరి జిల్లాలలో షెడ్యూల్స్ని పూర్తి చేశారు. ఈ సినిమా లో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుండగా ఆమెకు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇక కియారా – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న రెండవ సినిమా కూడా. ఇక కొత్త షెడ్యూల్లో మేజర్ టాకీ పార్ట్ను శంకర్ కంప్లీట్ చేయనున్నారు. నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఆర్సీ 15ను 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అధికారికంగా వెల్లడించారు. ఆ దిశగానే షూటింగ్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?