# RC 15: ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాను క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. జస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్కే లక్షలు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. పూణేలో జరిపిన షెడ్యూల్ కోసం బడ్జెట్ భారీగానే ఖర్చు చేశారట. ఇక ఓ ట్రైన్ ఎపిసోడ్ కోసం కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇలా ఒక్కో అప్డేట్ వస్తున్నా కొద్ది చరణ్ – శంకర్ సినిమా మీద ఊహించని విధంగా అంచనాలు పెరిగిపోతున్నాయి.
తెలుగుతో పాటు హిందీ, అన్ని సౌత్ భాషలలో రిలీజ్ చేయనున్న ఈ భారీ ప్రాజెక్ట్ను పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పలువురు పాపులర్ యాక్ట్రస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే శంకర్ సినిమా ఎంత హై టెక్నికల్ వ్యాల్యూస్తో రూపొందినప్పటికీ హ్యూమన్ ఎమోషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మర మనిషికి అన్నీ ఫీలింగ్స్ ఉంటాయని రోబో చూపించి ఒప్పించిన దర్శకుడు శంకర్.
# RC 15: ఆడియన్స్ వేరే లెవల్ ఊహించుకుంటున్నారు.
ఎలాంటి కథ అయినా కథా నేపథ్యం మాత్రం ఎమోషనల్గా సాగుతుంది. అదే సినిమాకి హైలెట్గానూ నిలుస్తుంది. అలాంటి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారట శంకర్. జెంటిల్ మేన్, అపరిచితుడు, భారతీయుడు సినిమాలలో ఉన్న సెంటిమెంట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చరణ్ సినిమాలోనూ ఉందని ఇది శంకర్ మార్క్తో ఆడియన్స్ను చాలా ఎమోషన్కు గురిచేసేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది శంకర్ ప్రతీ సినిమాకు వాడే ఫార్ములానే. ఇప్పుడు చరణ్ – శంకర్ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్కు ఆడియన్స్ వేరే లెవల్ ఊహించుకుంటున్నారు. మరి సెంటిమెంట్ ఫ్లాష్ బ్యాక్ అని రొటీన్గా చూపిస్తే మాత్రం ఫ్యాన్స్ గ్యారెంటీగా తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?