‘RC15’: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం తెరకెకుతున్న లేటెస్ట్ భారీ సినిమాలలో ఇండియన్ ఐకానిక్ డైరెక్టర్ క్రియేటివ్ జీనియస్ శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా అటు రామ్ చరణ్ ఇటు శంకర్ కెరీర్లో 15వ సినిమాగా రాబోతుండటం విశేషం. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నిర్మాత దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు 50వ సినిమా కావడం కూడా మరో విశేషం. అందుకే ఈ సినిమాపై అందరిలోనూ తారా స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక శంకర్ సినిమా అంటే కథ ఆయనదే అయి ఉంటుంది. ఇప్పటి వరకు శంకర్ సొంత కథలతోనే సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. కానీ, మొదటిసారి వేరే వాళ్ళ కథతో శంకర్ చరణ్తో తీస్తున్న ఆర్సీ 15 ను రూపొందిస్తున్నారట. ఆ దర్శకుడెవరో కాదు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. దర్శక, నిర్మాత అయిన కార్తీక్ సుబ్బరాజు కీర్తి సురేశ్ లాంటి క్రేజీ హీరోయిన్తో పెంగ్విన్ వంటి ప్రయోగాత్మక చిత్రాలను నిర్మిస్తూనే..సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వారిని డైరెక్ట్ చేస్తూ కోలీవుడ్లో క్రేజీ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్నారు.
‘RC15’: ఈ దర్శకుడు తయారు చేసుకున్న కథే ఆర్సీ 15
ఈ దర్శకుడు తయారు చేసుకున్న కథే ఆర్సీ 15గా ఇప్పుడు తెరకెక్కుతోంది. నా కథనే శంకర్ సార్ తీసుకొని ఆయన స్టైల్కు తగ్గట్టుగా డెవలప్ చేసి ఇప్పుడు సినిమాను తీస్తున్నారు. ఇందులో చరణ్ సార్ హీరోగా నటిస్తుండటం చాలా సంతోషంగా ఉందని దర్శక, నిర్మాత కార్తీక్ సుబ్బరాజు తెలిపారు. ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత టాకీ పార్ట్ ఓ ఫైట్, అలాగే..ఓ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్తో దిల్ రాజు ..శిరీష్తో కలిసి నిర్మిస్తున్నారు.