సాధారణంగా కుటుంకథా చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చే నిర్మాత దిల్రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రం `ఇద్దరి లోకం ఒకటే`. రాజ్తరుణ్, షాలిని పాండే జంటగా నటించారు. జీఆర్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకని `యు/ఎ` సర్టిఫికేట్ను పొందింది. అయితే నిజానికి ఈ సినిమాలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు లేవు. క్లీన్ `యు` సర్టిపికేట్ రావాల్సిన చిత్రమిది. అయితే సినిమాలో ఓ లిప్లాక్ ఉంది. కథకు అవసరం కాబట్టి ఆ సీన్ను ఉంచాల్సి వచ్చిందట. దీంతో సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ చెప్పకుండా `యు/ఎ` సర్టిఫికేట్ను ఇష్యూ చేసింది. ఈ చిత్రంలో డిసెంబర్ 25న విడుదలవుతుంది.