Liger: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలో సినిమాలు తీసి హిట్ కొట్టే డైరెక్టర్ పూరి జగన్నాథ్. చాలా తక్కువ టైంలోనే సినిమాలు చేసి.. పూరి అనేక విజయాలు సాధించడం జరిగింది. మహేష్ పూరి కలయికలో వచ్చిన బిజినెస్ మాన్ కేవలం 90 రోజుల్లో కంప్లీట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి 2019 వ సంవత్సరంలో “ఇస్మార్ట్ శంకర్” అనే సినిమాతో హిట్ కొట్టడం తెలిసిందే. ఆ తర్వాత పాన్ ఇండియా నేపథ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” ప్రాజెక్టుని ప్రకటించడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాగా కరోనా లాక్డౌన్ కి ముందు దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా… కరోనా థర్డ్ వేవ్ కంప్లీట్ అయిన తర్వాత మొన్న మార్చి కల్లా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తరువాత వెంటనే మళ్లీ పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం “జనగణమన” షూటింగ్ జరుగుతుంది. అయితే కంప్లీట్ అయిన “లైగర్” విడుదల చేయకుండా.. ఆగస్టు నెలలో విడుదల ప్రకటించటం ఆలస్యానికి గల కారణం ఏంటో అనే దానిపై రకరకాల డిస్కషన్స్ అభిమానులలో ఎప్పటినుండో జరుగుతున్నాయి.
అయితే “లైగర్” ఆలస్యానికి గల ప్రధాన కారణం నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ అని టాక్. సినిమా కంప్లీట్ అయ్యి తొమ్మిది నెలలు కావస్తున్నా గాని… ప్రమోషన్ విషయంలో కరణ్ జోహార్ తీసుకుంటున్న అతి జాగ్రత్తల వల్ల.. ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ అదేవిధంగా హీరోయిన్ అనన్య పాండే లతో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేయడానికి కరణ్ జోహార్ సన్నాహాలు చేస్తున్నారట. సినిమా అవుట్ ఫుట్ బాగా రావడంతో కరణ్ ఈ విధంగా ప్లాన్ వేయడం జరింగిందట.