Nandamuri: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హీరోల మధ్య భారీగా పోటీ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక చాలా ఇండస్ట్రీలలో సినిమారంగంలో ఈ పోటీ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే కొన్ని దశాబ్దాల నుండి నందమూరి వర్సెస్ మెగా హీరోల సినిమాలు పోటీపడుతూ ఉండే పరిస్థితి. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి భారీగా అభిమానుల మధ్య పోటీ వాతావరణం నెలకొల్పేవి.
బాలయ్య బాబు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి వంటి ఫ్యాక్షన్ సినిమాలతో అదిరిపోయే రికార్డు సృష్టించగా అదే టైమ్ లో చిరంజీవి “ఇంద్ర” సినిమాతో ఊహించని రీతిలో .. కళ్ళు చెదిరే విధంగా రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత మెల్లమెల్లగా నందమూరి వర్సెస్ మెగా హీరోల మధ్య పోటీ వాతావరణం చల్లబడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈసారి సోషల్ మీడియాలో ఈ పోటీ వాతావరణం మళ్లీ స్టార్ట్ అయింది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మేటర్ లోకి వెళ్తే నందమూరి హీరో ఎన్టీఆర్ యూట్యూబ్ లో “RRR” సినిమా ద్వారా రికార్డ్ క్రియేట్ చేస్తే.. ఆ రికార్డులను మెగా హీరో అల్లు అర్జున్ “పుష్ప” టీజర్ ద్వారా బ్రేక్ చేశాడు.
ఇదే క్రమంలో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రికార్డులను తాజాగా నందమూరి బాలయ్య బాబు “అఖండ” సినిమా టీజర్ ద్వారా అవలీలగా పగలగొట్టే విధంగా పరిస్థితి మారింది. వస్తున్న రెస్పాన్స్ బట్టి చూస్తే తెలుగు సినిమా రంగంలో యాభై మిలియన్ వ్యూస్ అతి తక్కువ టైమ్ లో సాధించిన సినిమాగా “అఖండ” సరికొత్త రికార్డులు క్రియేట్ చేయటం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. “RRR” ఎన్టీఆర్ టీజర్ కి యాభై మిలియన్ వ్యూస్ సాధించడానికి ఆరు నెలలు పట్టగా…అల్లు అర్జున్ “పుష్ప” సినిమా ఇరవై రోజుల్లో సాధించింది. అయితే ఇప్పుడు బాలయ్య బాబు నటించిన “అఖండ” టీజర్…రెండు వారాల్లోనే 46 మిలియన్ వ్యూస్ సాధించటం జరిగింది. దీంతో మరో మూడు రోజుల్లో 50 మిలియన్ వ్యూస్.. సాధించడం పెద్ద మేటర్ ఏమీ కాదని.. అంటున్నారు సినీ విశ్లేషకులు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?