ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కి పాన్ ఇండియా మార్కెట్ కలిగిన హీరోలు. బాహుబలి తో ప్రభాస్, RRRతో తారక్, రామ్ చరణ్..”పుష్ప”తో అల్లు అర్జున్ పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు విడుదల చేసి అద్భుతమైన విజయాలు అందుకోవటం జరిగింది. పైన నలుగురిలో ముగ్గురు ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ రాజమౌళి దయవల్ల పాన్ ఇండియా నేపథ్యంలో సత్తా చాటారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం రాజమౌళితో సినిమా చేయకుండానే “పుష్ప”తో అదిరిపోయే విజయం సాధించడం జరిగింది.
ఇదిలా ఉంటే తెలుగులో సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న మహేష్ బాబుకి మాత్రం టాలీవుడ్ మినహా బయట పెద్దగా మార్కెట్ లేదని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాల క్రితం తమిళంలో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో “స్పైడర్” చేసి దారుణమైన పరాజయాన్ని ఎదుర్కోవటం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా సంగతి తెలిసిందే. “SSMB28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.
ఈ సినిమా అన్ని పలు భాషల్లో విడుదల చేయాలని త్రివిక్రమ్ ఆల్రెడీ ప్లాన్ చేయటం జరిగింది అంట. ఈ మేరకు “SSMB28” హిందీలో కూడా విడుదల చేయాలని నిర్మాతలతో మరియు మహేష్ బాబుతో డిస్కషన్ చేస్తే ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గండి అని మహేష్ సూచించినట్లు లేటెస్ట్ గా ఇండస్ట్రీలో నడుస్తోంది. పాన్ ఇండియా నేపథ్యంలో కేవలం రాజమౌళి సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలని మహేష్ ప్లానింగ్ అన్నట్టు సమాచారం. దీంతో త్రివిక్రమ్ సినిమాని హిందీలో డబ్ చేయకుండా మహేష్ ముందుగానే ఆ ప్రయత్నాలకు బ్రేకులు వేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!