Chiranjeevi: 2019వ సంవత్సరంలో “సైరా” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నటించిన సినిమా “ఆచార్య”. ఈ సినిమా ఇటీవల విడుదల అయి బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ తో కలసి చిరంజీవి ఫుల్ లెంత్ గా చేసిన గాని ఏ మాత్రం అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. పైగా ఇండస్ట్రీలో అప్పటి దాక ఒక పరాజయం లేని డైరెక్టర్ గా కొరటాల ఈ సినిమా చేయడంతో… గ్యారెంటీ “ఆచార్య” విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఏ పరంగా కూడా “ఆచార్య” ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా చివరాకరికి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మహమ్మారి కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే “ఆచార్య” షూటింగ్ జరుపుకోవటం.. రిజల్ట్ దారుణంగా రావటం.. అటు డైరెక్టర్ కి… సినిమా యూనిట్ కి బాధ కలిగించినట్లైంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఇప్పుడు మలయాళంలో సూపర్ డూపర్ హిట్ సినిమా “లూసిఫర్” నీ చిరంజీవి తెలుగులో “గాడ్ ఫాదర్” టైటిల్ పేరిట రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించగా.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఇటీవల యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా వచ్చే ఆగస్టు 22వ తారీకు రిలీజ్ చేయాలని మేకర్స్ తాజాగా డిసైడ్ అయినట్లు సమాచారం.
“ఆచార్య” రిజల్ట్ దారుణంగా ఉండటంతో తన పుట్టినరోజు నాడు అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని “గాడ్ ఫాదర్” విడుదల చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించడం జరిగింది. విభిన్నమైన పొలిటికల్ యాక్షన్ త్రీలర్..గా తెరకెక్కిన ఈ సినిమా.. స్టోరీని తెలుగు నెటివిటీకి సరిపడా రీతిలో డైరెక్టర్ మోహన్ రాజా “గాడ్ ఫాదర్” స్క్రిప్ట్ లో కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు. కొణిదెల మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తల్లి పాత్రలో గంగవ్వ నటిస్తోంది. సినిమా షూటింగ్ దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు.. ఆగస్టు నెలలో తన పుట్టిన రోజునాడు అభిమానులను అలరించాలని “గాడ్ ఫాదర్” రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!