పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణు దేశాయ్ చాలా వరకు హైదరాబాదు నుండి దుకాణం సర్దేసి పూణే కి వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లలు అకీరానందన్, ఆధ్యా తో కలిసి పుణేలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాల గురించి నెటిజన్ల తో టచ్ లో ఉంది. అంతేకాకుండా గతంలో రెండో వివాహం చేసుకోవడానికి కూడా రేణు దేశాయ్ రెడీ అవగా మధ్యలోనే ఆ కార్యక్రమం ఆగిపోయింది. కానీ ఎందుకు ఆగిందో దానికి సంబంధించిన కారణాలు ఏవీ కూడా బయటకు రాలేదు.
ఆ తరువాత టెలివిజన్ రంగంలో పలు షో లలో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆ తర్వాత ఇంటికే పరిమితం అయ్యారు. అప్పట్లో 2019 ఎన్నికల సమయంలో జర్నలిస్టు తరహాలో సాక్షిలో ఒకరోజు రైతులతో ముచ్చటించారు. ఇదిలా ఉండగా గతంలో తనకి సినిమాల్లోకి రావాలని, ఎవరైనా డైరెక్టర్ హీరోకి తల్లిగా, పిన్ని గా కానీ ఛాన్స్ ఇస్తే రీ ఎంట్రీ ఇస్తానని తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా రేణు దేశాయ్ స్వయంగా తానే డైరెక్టర్ గా అవతారమెత్తి రైతుల సమస్యల గురించి ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా రేణుదేశాయ్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. దీనిలో భాగంగా సినిమాల్లో పాటల కోసం ప్రముఖ రచయిత గోరేటి వెంకన్న ను కలవడం జరిగింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వటంతో ఆల్ ది బెస్ట్ రేణుదేశాయ్ అని కామెంట్లు పెడుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా కరోనా వైరస్ ఎఫెక్ట్ మొత్తం తగ్గిన తరువాత ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేయాలని రేణుదేశాయ్ అనుకుంటున్నట్లు సమాచారం.