“బద్రి” సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన రేణుదేశాయ్ తర్వాత “జానీ” చేయడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పెళ్లి పిల్లలు మరియు 2011లో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ చాలాకాలం ఇండస్ట్రీకు దూరంగా ఉంటూ సొంత రాష్ట్రం పూణేలో పిల్లలతో జీవిస్తూ వచ్చింది. ఆ తర్వాత బుల్లి తెరపై అడపాదడపా కనిపించిన రేణు దేశాయ్ ఒకనొక సందర్భంలో సోషల్ మీడియాలో రీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
“బద్రి” సినిమా రిలీజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తరుణం లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో రేణు మాట్లాడుతూ మీ సినిమాలో ఏదో ఒక పాత్ర చేస్తానని మనసులో మాట బయట పెట్టడం జరిగింది. ఆ తర్వాత రేణు దేశాయ్ మహేష్ బాబు సినిమాలో నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు రాగా వాటిలో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
ఇదిలావుండగా తాజాగా 17 సంవత్సరాల తర్వాత రేణు రీ ఎంట్రీ కి రెడీ అయ్యారు. “ఆద్య” అనే సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో పాటు ఇందులో రేణు దేశాయ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా డైరెక్టర్ తీర్చిదిద్దడంతో ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు చాలా గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ సినిమా ఒప్పుకోవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.