టాప్ డైరెక్టర్గా కెరీర్ను స్టార్ట్ చేసిన రామ్గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాడు. ప్రస్తుతం ఈయన `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా.. ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. `మెగాఫ్యామిలీ` అంటూ తానొక సినిమా చేయబోతున్నట్లు పూర్తి వివరాలను మంగళవారం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. అయితే తాను `మెగాఫ్యామిలీ` సినిమాను చేయడం లేదంటూ మంగళవారం వర్మ ట్వీట్ చేశాడు. తన సినిమాలో ప్రధాన పాత్రధారికి 39 మంది పిల్లలు ఉండటం.. తాను పిల్లల సినిమాలను సరిగా తీయలేను కాబట్టే `మెగాఫ్యామిలీ` సినిమాను తీయలేకపోతున్నానంటూ వర్మ తాను సినిమా చేయలేకపోవడానికి కారణాలుగా చెప్పుకొచ్చారు.
MEGA FAMILY is about a man who has 39 children but since there are too many children and I am not good in making children’s films,I decided not to make it
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2019