లాక్డౌన్ సమయంలో కూడా తన సినిమాలకు ఏ మాత్రం అంతరాయం కలగకుండా చూసుకున్న ఏకైక సినీ ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ. ఇండస్ట్రీ వారంతా ఇంట్లో సైలెంట్ గా కూర్చుంటే ఈయన మాత్రం కరోనా ను లెక్కచేయకుండా దూసుకుపోయాడు. లాక్ డౌన్ ముందుగా పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో తెరకెక్కించిన ఈ ‘క్లైమాక్స్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఆర్జీవి వరల్డ్/ శ్రేయాస్ మీడియా యాప్ లో విడుదల చేశాడు.
థియేటర్లు మూత పడిన కారణంగా ఆన్లైన్లో వర్మ విడుదల చేసిన ‘క్లైమాక్స్’ చిత్రం తొలి రోజు భారీ సక్సెస్ గా నిలిచింది. ఓటిటిలో మొట్టమొదటిసారి వినూత్న శైలిలో విడుదలైన ఈ చిత్రానికి టికెట్ ధర వంద రూపాయలు గా నిర్ణయించారు. ఇక జీఎస్టీ తదితర వాటితో కలిపి ఆ చిత్రం చూసేందుకు 130 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది మామూలు థియేటర్ టికెట్ ధర కన్నా కొద్దిగా ఎక్కువ అనే చెప్పాలి.
అయితే అందరి అంచనాలకు భిన్నంగా తొలి 12 గంటల్లోనే ఏకంగా 1,68,596 మంది ఈ చిత్రాన్ని వీక్షించడం గమనార్హం. అంటే 12 గంటల్లో ఈ చిత్రం దాదాపు 1.6 కోట్లు వసూలు చేసింది అన్నమాట. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో తీసిన ఏ ఒక్క చిత్రం కూడా మొదటి రోజు ఇంత వసూళ్లు దక్కించుకోవడం గమనార్హం. థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసి వర్మా సినిమాకి ఇంత మొత్తం వచ్చే అవకాశమే లేదు అని బయట టాక్.
వాస్తవానికి తొలి రోజున రూ. 50 లక్షల కలెక్షన్స్ రావచ్చని వర్మ అంచనా వేశారు. అయితే, అంచనాలను మించి వసూళ్లు వచ్చాయి. అందరూ ఇంట్లో లాక్ డౌన్ ఖాళీగా ఉండడం.. వర్మ ఇచ్చిన హైప్ కారణంగా ఈ చిత్రం ఇంత వసూళ్ళు కొల్లగొట్టి ఇండస్ట్రీకి కొత్త ఊపు తెచ్చింది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!