డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆగస్టు 25వ తారీకు విడుదలైన “లైగర్” జనాలను ఏమాత్రం అలరించలేకపోయిన సంగతి తెలిసిందే. మొదటి రోజే నెగటివ్ టాక్ రావడం జరిగింది. హీరో విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ బాగా చేసినా కానీ డైరెక్టర్ పూరీ మార్క్ సినిమాలో ఎక్కడ కనిపించలేదని… చూసిన జనాలు కామెంట్ లు చేయడం జరిగింది. వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ కి పూరి జగన్నాథ్ మంచి ఎట్టిస్తాడని అభిమానులు ఆశించగా దారుణంగా అట్టర్ ఫ్లాప్ ఇవ్వటంతో.. పూరిపై సోషల్ మీడియాలో తెగ సీరియస్ కామెంట్లు చేస్తూ ఉన్నారు.
విజయ్ దేవరకొండ కష్టం మాత్రమే సినిమాలో ఉందని దర్శకుడు పూరి తన పెన్ కి ఏ మాత్రం పని పెట్టలేదని చెప్పుకొస్తున్నారు. అసలు సినిమాలో ఎప్పుడు సాంగ్ వస్తుందో ఎందుకు వస్తుందో కూడా సందర్భం లేకుండా ఉంది. హీరోయిన్ కూడా ఎందుకు పెట్టారో ఎవరికి అర్థం కాదు అని జనాలు అంటున్నారు. ఇటువంటి తరుణంలో పూరి జగన్నాథ్ కి గురువు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా “లైగర్” సినిమా చూడటం జరిగింది.
సినిమా చూసినా అనంతరం పూరి జగన్నాథ్ పై రాంగోపాల్ వర్మ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్ గాడు బాడ్కో మాదిరిగా.. ఏం సినిమాలు తీస్తున్నాడు..? ఒకప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో అలరించిన పూరి.. ఈ రకమైన సినిమాలు తీయడం దారుణమని అన్నారు. ఇప్పుడే వాడి ఇంటికి వెళ్లి వాడిని కొడతాను.. తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడతాను అని రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో తన శిష్యుడు తీసిన “లైగర్” పరాజయం పాలు కావటం పట్ల రియాక్ట్ అయ్యారు.