దక్షిణాదిలో హీరోలకు, సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే విషయాన్ని బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కూడా చెబుతున్నాడు. దక్షిణాదిన రజనీకాంత్, అల్లుఅర్జున్, చిరంజీవి, విజయ్ వంటి హీరోల సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా తొలి మూడు రోజులు థియేటర్స్ హౌస్ఫుల్ అవుతాయి. అందుకు కారణం వాళ్ల ఫ్యాన్స్ మూడు రోజులు థియేటర్స్కు వస్తారు. వీళ్లకు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ హీరోలు కూడా ఫ్యాన్స్కు చాలా విషయాలు చేశారు. కాబట్టే వాళ్లకు ఫ్యాన్స్ క్లబ్లున్నాయంటూ దక్షిణాది స్టార్ హీరోల సినిమాలకున్న క్రేజ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
previous post
next post