Nani: సినిమా టికెట్ల లొల్లి ఏపీ రాజకీయాలను టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఊహించని రీతిలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను అమాంతం తగ్గించడంతో.. టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు టికెట్లు అమ్ముకుంటే… థియేటర్ నడుపుకోవడానికి సినిమా తీసిన నిర్మాతకు ఎటువంటి లాభం ఉండదని చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే తరుణంలో టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని(Nani).. తన కొత్త సినిమా “శ్యామ్ సింగరాయి”(Shyamsingrai) రిలీజ్ ఈ సమయంలో మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు ఇంకా పెను దుమారాన్ని రేపుతున్నాయి. సినిమా టికెట్ల రేట్లు ధరల కంటే సినిమా ధియేటర్ పక్కనే ఉండే కిరాణా కొట్టులో కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయని.. ఇది దారుణం అని ఏపీ ప్రభుత్వం పై వ్యంగ్యంగా విమర్శలు చేయడం జరిగింది.
దీంతో నాని చేసిన వ్యాఖ్యల పై వైసీపీ మంత్రులు వరుసగా కౌంటర్ లు ఇస్తున్నారు సంగతి తెలిసిందే. మంత్రి పేర్ని నాని(Perni Nani), బొత్స సత్యనారాయణ, అదేవిధంగా కొడాలి నాని(Kodali Nani)… హీరో నాని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ రీతిలోనే రోజా … నాని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఏపీలో థియేటర్ లో రాని కలెక్షన్లు… కిరాణా కొట్టు లో వచ్చేటప్పుడు.. నువ్వు సినిమాలు తీయటం వేస్ట్ కిరాణాకొట్టు పెట్టుకోవచ్చు కదా.. అంటూ రోజా నానిపై ఫైర్ అయ్యారు.
ఇటువంటి కామెంట్లు చేయడం వల్ల ఇండస్ట్రీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని… ఇటువంటి పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకుంటే అటు పెద్ద సినిమాలకు ఇటు చిన్న సినిమాలకు న్యాయం చేసినట్లు అవుతుందని.. రోజా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మరోపక్క సినిమా టికెట్ల వ్యవహారం విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా పెద్ద సినిమాలు.. రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం టిక్కెట్ల ధరల విషయంలో.. ఏ విధంగా ముందుకు వెళుతుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా నెలకొంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!